Sunday, 13 October 2024

భాషావైభవం

 


:శీర్షిక "యుగయుగాల తెలుగు జగమంతావెలుగు వ్యాసం ." 

అంశం..".తెలుగు  సాహిత్యం  మనుగడ.."

    -------------------------------------- 

            మన మాతృభాష తెలుగు.అమ్మను అమ్మభాషను అమ్మ సంస్కృతిని  ఆదరించి సేవించి తరించే మహోన్నతసంస్కృతి మనది.గతచరిత్ర వైభవం గమనిస్తే తులనాత్మక పరిశీలన చేసుకుంటేనే,మనుగడ  తెలిసుకొని మందడుగువేసేది.

అమ్మభాషను. ఆదరించి అగ్రస్థానంలో నిలబెట్టవలసిన బాధ్యత తెలిసి  ఆ భాషామతల్లి బిడ్డలలైన  మన అందరిపైనా ఉంది .. .     

జాతి జాతి నంతటినీ  జాగృతినొందించి జయపతాకాన్ని రూపొందించి  ఎగురవేసిన రాజులు 

కవిపండిత పోషకులు భాషాభిమానాలను గురించి తెలుసుకుంటేనే పోరాటపటిమ పెరిగేది

ఆర్ధ్రతనిండినభాష ,ఆప్యాయతచూపెడిభాష.ఆసక్తిని పెంచెడిభాష ఆనందం నింపెడిభాష ,అన్నిభాషలను కలుపుకు పోవుటకు ,అనుగుణమైన అమృత సమమైన  మన మాతృభాష  తెలుగుభాష. అలాంటి మనమాతృభాష  గురించి చెప్పుకోవాలంటే  మహాగ్రంథ మౌతుంది.  

    భారతీయ భాషా కుటుంబాలలోనే గాక  ప్రపంచభాషా కుటుంబాలలోనే అతిపెద్ద భాషాకుటుంబము ద్రవిడభాషాకుటుంబము .ఈ ద్రావిడభాషాకుటుంబము దక్షిణ భారత దేశమంతటా వ్యాపించింది.. ..దీనికి నాలుగువేల సంవత్సరాల సుదీర్ఘచరిత్ర ఉంది.. .

 ద్రావిడభాషాకుటుంబములలో తెలుగుభాషకు చాలా సుదీర్ఘమైన చరిత్రఉంది .ద్రావిడభాషాకుటుంబములోతెలుగుమాట్లాడేవారిసంఖ్య ప్రథమంగాఉంద  

అయితే!  అంతరించిపోనున్న భాషలకు కూడా మన భాష అతిచేరువగా వెళ్తోందిఅనే ఆందోళన   వాదన   కూడా  లేకపోలేదు.మేధావి వర్గాల అంచనా ప్రకారం  పరాయిభాషల. ప్రభావంలో కొట్టుకుపోతున్న మన మాతృభాషకు.మనమే మనుగడ లేకుండా చేస్తున్నాం...

అలాటి వారలో మనమే. ముందంజలోఉన్నాము ఈమాట”నూటికినూరుపాళ్ళూ”నిజమే.దీనికి “కర్ణుని చావుకి ఉన్నట్లు కారణాలుఉన్నాయి.

తెలుగు నేలమీద భాషమనుగడకోసం నేటికీ తెగించి పోరాడుతున్నవారుఉన్నారు ....

ప్రభుత్వాలతో మొదటినుండీ యుధ్దాలు చేస్తున్నవారూ ఉన్నారు.. అయితే !ఆ సంఖ్య చాలా తక్కువ . ఈ భాష పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుంటేనే  ఈ   భాషను ఎందుకు కాపాడాలో. మనకు అర్థం అవుతుంది...ఆంధ్ర లేదా తెలుగు  భాషకు పర్యాయపదాలుగా  ఆంధ్ర,తెనుగు,తెలుగు,పదాలు వాడుకలో ఉన్నాయి. ఆయాకాలాల్లోజాతిపరంగా దేశపరంగా భాషాపరంగా ఇవి ప్రసిద్ధిని పొందాయి ..మొట్టమొదటిసారిగాకీస్తుపూర్వం.  ౬౦౦.    600 ప్రాంతానికి. చెందినఐతరేయ బ్రాహ్మణంలో“ఆంధ్రపదం”జాతివాచకంగా. ఉపయోగింపబడింది.   

వ్యాసమహాభారతంలో కూడా  ఆంధ్రపదం   జాతివాచకంగా   కనిపిస్తుంది. వాల్మీకి   రామాయణంలో “ఆంధ్రశబ్దం” దేశవాచకంగా కూడా.  కనిపిస్తుంది. .

భాగవతంలో బలికుమారులు ఆరుగురిలో “ఆంధ్రుడనేవాడు” మన ఆంద్రరాజ్యం స్థాపించినట్లు చెప్పబడింది .బౌద్ధ వాజ్మయంలో పాళీ గ్రంథంలో “అంధరకట్ట “అనే పదాన్ని ఆంధ్రరాష్ట్రమన్నారని , ఆంధ్రులు, అంధకులు ఒక్కటేనని మల్లంపల్లి సోమశేఖర శర్మగారు పేర్కొన్నారు . అనేకశాసనాలలో అదే ఉన్నదట ..ఐతరేయబ్రాహ్మణకథనంబట్టిఆంధ్రులు“విశ్వామిత్ర”సంతతికచెందినవారనివిశ్వామిత్రుని శాపంవలన వింధ్యపర్వతాలకు దక్షిణంగా వెళ్ళారని తెలుస్తుంది ..

 త్రిలింగ నుండి తెలుగు అనేపదం పుట్టినదని రెండవ కాకతీయప్రతాపరుద్రుని ఆస్థానకవి విద్యానాదుడు అనుకవి వ్రాసారు.నాటి ఆంధ్రదేశంలోని త్రిలింగములనబడెడి శ్రీశైలము ,కాళేశ్వరము, భీమేశ్వరముఅను త్రిలింగముల నడుమప్రదేశము తెలుగునేల. .తెనుంగు ,తెలుంగు,తెలుగు గా పేరుపొందింది.ఒక విశిష్ట జాతిగాతెగలసమాహారంగా. తెలుగు చరిత్రేకాదు,

ఆచరిత్రకు పునాదులెత్తిన  మనభాషాచరిత్ర కూడా. మహోజ్వలమైనదే.    ఆంధ్రజాతి ప్రశస్తికి, తెలుగుభాషా ప్రశస్తికి , ఆనవాళ్ళుగా క్రీ: పూ :౩౦౦ నాటికే కళింగం మొదలుకొని 

ఆకొననుండి ఈకొనదాకాఆంధ్ర జనపదాలు. ఆంధ్రనగరులూ వెలిసాయి..క్రీ:పూ :633 నాటికే బ్రాహ్మీలిపిలోభాగంగా తెలుగు బ్రాహ్మీ అవతరించింది

..బ్రాహ్మికి ప్రాచీనతెలుగు ఆధారమని కొందరతమిళ పండితుల విశ్వాసము .క్రీ:శ: ౧ వశతాబ్దమునుండి సాహిత్యభాషగా తెలుగు పదసంపదకుపట్టం కట్టబడిందంటారు విజ్ఞులు. 

శాతవాహన చక్రవర్తులలో ఒకరైన హాలుడి"గాధాసప్తసతి" ప్రపంచ కథానికకు ప్రాణాధారలు అందించినది. గుణాధ్యుని “బృహత్కథా" సంపుటంలోకూడా తెలుగులో ప్రాకృతపదాలు 

చోటుచేసుకున్న కాలంకూడా అదే. సంస్కృత కధావాజ్మయంలోని ఎన్నోకథలకు ఈ ప్రాకృతమే మూలం .ప్రాకృతం తెలుగును అక్కునచేర్చుకుంది...

బౌద్ధవాజ్మయంలోని పాలీ భాషలోనికి మూడువేలకు పైగా పదాలకు చొచ్చుకెళ్ళాయని,  క్రీ:పూ: 130 నాటికే తమిళవ్యాకరణం“అగత్తియం" 

 తెలుగు పదాల్ని భాషాపరంగా అరువుతెచ్చుకొని వాడుకుందట .. ఋషితుల్యుడైన  ప్రాచీనతమిళకవి తిరువళూర్ తన శైవగ్రంథంలో తెలుగును ఎంతగానో ప్రశంసించారు ..

తమిళనాడులోని “మధురైఆధీనం"అనే సంస్థానములలోలభించిన తెలుగు ప్రాచీన పత్రాలలో  తెలిసింది.శైవసిద్ధాంత సాహిత్యంలోని యోగ శాస్త్ర సంబంధం ఉన్న 51 అక్షరాలున్న ఏకైకవర్ణమాల తెలుగు తప్ప మరే ప్రాచీన భాషలోనూ లేదని ఆంధ్రఫ్రదేశ్  లోఉన్నతాధికారిగా పనిచేసిన

 “ కాశీపాంఢ్యన్ “అనేతమిళపరిశోధకుడు తెలియజేసారు.  సాహితీసార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు “దేశభాషలందు తెలుగు లెస్స”అని తెలియజేస్తే ,  

ఎందరో  దేశీయపండితులేగాక  ,పాశ్చాత్య పండితులు కూడా తెలుగు భాషా మాధుర్యాన్ని వేనోళ్ళ కీర్తించారు. భాషకున్న విశిష్టతనుబట్టి ,శ్రుతి మాధుర్యాన్నిబట్టి, అజంతమైన మనభాషను  పాశ్చాత్యులు “ ఇటాలియన్ ఆఫ్ థ ఈస్ట్” గా వర్ణించారు. 

   భారతీయ భాషలను విఫులీకరిస్తూ ,జె.టి. ఎస్ .హాల్డేన్ “తెలుగుభాషకు అత్యంత సమన్వయ శక్తి ఉన్నదని , ఈభాషకు విభిన్న స్రవంతులను తనలో లీనం చేసుకునే. సమర్ధత  యున్నదని కొనియాడారు .. ఆ పాశ్చాత్యులే మనభాషా ఔన్నత్యాన్ని వేనోళ్ళపొగడడమే కాకుండా.అనేకతెలుగు పద్యాలను కావ్యాలను, అనేక తాళపత్ర గ్రంథాలను ,ఎన్నో రచనలను వెలుగులోనికి తెచ్చారు. .

నిఘంటువులను , వ్యాకరణ గ్రంథాలను స్వయంగా వ్రాసారు .పరిష్కృతప్రతులు తయారుచేసి ముద్రించారు .తెలుగుభాషకు వీరు చేసినసేవ అనన్య సామాన్యం .  

 మన భాష ప్రాచీనభాషగా గుర్తింపబడిన నేపధ్యంలో అంతర్జాతీయ కీర్తినిపొందడంలో ,ఆకీర్తిని ఆపాదించడంలో వారి సేవలు కూడా ఈ సమయంలో మరచిపోలేము .

“నైలునది నాగరికతలో సామాన్యుని జీవితమెలాగుందో తెలియదుగాని,,ఈజిప్టులోని నైలునదినుంచి మన కృష్ణాతీరందాకాసాగిన.  ప్రజల నౌకాయానం. తెలుగువారు సకల దీవులలో.,

 వివిధజాతుల నాగరికతకు దోహదం చేసిన శుభఘడియలవి .ఈ పూర్వ యుగంలో ఆంద్రజాతి ప్రశస్తికి తెలుగు భాషా ప్రశస్తికి ఆనవాళ్ళుగా. క్రీస్తు పూర్వం 500 నాటికి బ్రాహ్మీ లిపిలో భాగంగా తెలుగు బ్రాహ్మీ అవతరించినది.   బ్రాహ్మీకి ప్రాచీన తెలుగు ఆధారమని. తమిళపండితుల. అభిప్రాయం..     దక్షిణాదిని ఏలిన శాతవాహనులు తొలినాళ్ళలో బౌద్ధం జైనం ప్రభావం వలన ప్రాకృతాన్ని తెలుగు ప్రాకృతాన్ని వర్ధిల్ల జేసినా  శాతవాహనులపాలన చివరిదశలో ఒకవర్గప్రభావానికి లోబడి రాజులు సంస్కృతానికి పెద్దపీట వేసారని ప్రతీతి.చాళుక్యరాజుల ప్రోత్సాహంతో ప్రారంభమైనతెలుగు సంస్కృతీకరణ నన్నయతో పూర్తయిందని, నన్నయాదుల ప్రౌఢ కావ్యరచనకు అదిపునాదులు వేసిందని చరిత్రకారులఅభిప్రాయం. అందుకే” పలుకు నుడికారమున్నభాష తెలుగని “శ్రీనాధమహాకవి” వివరిస్తే ,యతిప్రాసలులేని సంస్కృత కవిత్వారణ్యంలో” పుట్టిన   భారత   వేదానికి  ఆంధ్రత్వం నేర్పినది “తిక్కనకవి” అంటారు జాషువాకవి. హరికథాపితామహుడు కవిపండితుడైన “ఆదిభట్లనారాయణదాసు” 

"మొలకలేతదనము/ మొగ్గసొగసుదనము /పువ్వు తావితేనె తియ్యదనము /తెనుంగునకుగాక/ పరుష సంస్కృత భాషకెద్ది ?  అని అన్నారు .ఇలాఅనేకానేక సాహిత్య ప్రక్రియలలో అరుదైన అవధానాలలో అగ్రతాంబూలాలందుకున్నది తెలుగుభాష . బౌద్ధ వాజ్మయంలోని పాళీ భాషలో మూడువేలకు పైగా తెలుగుపదాలు చొచ్చుకు వెళ్ళాయి ...  

  క్రీస్తుశకం ౧౩౦ నాటికే తెలుగు వ్యాకరణం “అగత్తియం "తెలుగుపదాలను భాషాపరంగా అరువు తెచ్చుకుని వాడుకున్నదట.కనుకనే తమిళమహా కవి సుబ్రహ్మణ్య భారతి ,”కళింగత్తుపరణి “కావ్యకర్త జయగోండాన్ కవి “తె లుగును సుందరమైన భాషగా అభివర్ణిస్తూ  ఇలా అన్నారట .*సింధు నదిలోన పండువెన్నెలలోన చేర దేశపు చిరు పడతుల శోభ అందాల తెలుగులో ఆలపిస్తూ పాట అందరము పడవలో ఆడి వద్దాము “"మురిపించుతూ కొన్ని ముద్దు తెలుగు పదాలు అరవమ్ముతో కలసి అచటచట వాడుతూ చిరు తీపి పలుకులు చెవులు విందులు చేయ 

కరునాడు (కర్నాటక) యువతులూ గడియ తీయండి ..అని “తెలుగు మాధుర్యానికి తబ్బి ఉబ్బిపోయేవారట. అటు ఉత్తరాంధ్రంలోని కళింగం నుండి దక్షిణాదిన కంచిదాక ,ఇటు తెలంగాణంలోని కోటిలింగాలనుండి అటు మధ్యాంధ్రలోని కోటిపల్లిదాకా ,అటు ఉత్తరానమగధనుండి ఇటు దక్షిణాన మచలీపట్టణం వరకూ ఒక్కమాటలో శాతవాహనుల కాలంలోని తెలుగువారందరూ ఒకే రాజ్యంలో ఉండేవారట .ఆంధ్ర శాతవాహనుడు శ్రీముఖుడు  స్థాపించిన ఆంద్ర రాజ్యమని చరిత్రకారులనిర్ధారణ .ొ

వీరిపాలనకు ఎంపిక చేసుకున్న కేంద్ర స్థానాలు కరీంగర్ జిల్లాలోని కోటిలింగాల  కృష్ణాజిల్లాలోని శ్రీకాకూళం ,గుంటూరు జిల్లాలోని అమరావతి వరకూ విస్తరించినది .జనపదాలు జానపదకళలకు స్వచ్చమైనపలుకుబడులకు అటు తెలంగాణం ఇటు శ్రీకాకుళం ఆటపట్టులైనవట . మహాకవి నన్నయతో భాషానిర్మాణం కావ్యరచన జరిగాయని వాదించేవారు.

గ్రామ మాతృదేవతలను మనవారు గుర్తించరు .ఈ వివక్ష ఈతతంగమే జానపద సాహిత్యమునకు శాపమై తెలుగు సహజమైన వెలుగు చూపినవారిని గమనింపనేలేదు .చిన్నచూపు చూసారు .జానపదులను వారిభాష.మనవాళ్ళ నిరాదరణ వలనమరుగునపడింది.  మనవారి అశ్రద్ధ నిర్లక్ష్యం వలన ,అన్యభాషల పట్ల ఉన్న ఆసక్తి. తల్లి భాషపై లేకపోడంవలన తెలుగులో ౩౦౦ ఏడ్లకు పైబడిన తెలుగువారి సాహిత్య వికాశానికి చెందిన రచనలు మరుగున పడ్డాయని.    ఆచార్య సి.ఆర్.రెడ్డి , ఆచార్య .తిరుమల రామచంద్ర గారు వంటి భాషావేత్తలు బాధ పడ్డారట .తెలుగు నేలపైపుట్టి తెలుగు వాడవై పెరిగి తెలుగురాదని తింగరి మాటలాడెదవేల ?అని సాక్షి వ్యాసాలలో ఆంధ్రము రాదని ఆంగ్లములో మాటాడిన ఉపన్యాసకుని విమర్శిస్తారు. జంఘాలశాస్త్రి .మనసు తెలుపని భాష మచి పెంచని భాష ఉత్త సంద్రపు ఘోష ఓకూనలమ్మ అంటారు ఆరుద్రగారు

”మూలబడినభాష . పిల్లి పిల్లి దెబ్బలాటలో రొట్టెముక్కను కోతి ఎత్తుకుపోయినట్లు “మనభాషను ఆంగ్లభాష ఆక్రమించింది..్అన్ని మాండలీకాల సొగసులూ తనలో ఇముడ్చుకుంటూ తెలుగుభాష విభిన్న ప్రక్రియలలో వెలుగులు జిమ్ముతూ ప్రకాశిస్తోంది ...ఆదరించే   అన్యులను. అవి ల్లలను చూసి ఆనందంతో ఉప్పొంగుతెలుగుతల్లి స్వంతబిడ్డలు చీదరించుకుంటే చిన్న బోతోంది . విశిష్ట సేవలు చేస్తూ ఉన్నతిని చాటుతుంటే నాడు ఉజ్వలంగా వెల్లివిరుసిన తెలగుతల్లి నేడు  మమ్మీలకు మహా పీఠాలువేసి. అమ్మను  ఆవతలికి నెట్టేస్తుంటే ఆక్రోషిస్తోంది..తల్లివిలువతెలియని బిడ్డలను  చూసి  తల్లడిల్లుతోంది....అందుకే.  అమ్మను అమ్మభాషను అమ్మభూమిని గౌరవిద్దాం..

ముఖ్యంగా ప్రభుత్వాలు   సరియైన మార్గదర్శకాలను జారీచేసి భాష సర్వతోముఖాభివృద్ధికి విశేషమైన కృషి చేయాలి. స్వాతంత్ర్యం కోసం సమష్టి కృషి జరిగినట్లే.  భాషాభావృద్ధికి బహుముఖీయమైనకృషి జరిగి ,తెలుగుతల్లి. పునర్వైభవానికి ప్రతి తెలుగువాడూ కృషి చేయాలి .ఆనాడే భాషకు మనుగడ కలుగుతుంది..

ఆదిశగా అందరం  కలసి అడుగులేద్దాం ....

జై తెలుగుతల్లి.



 




                

    


      




..


No comments:

Post a Comment