చల్లని స్వామి- మన చందనస్వామి
చల్లని
స్వామి-మాచందనస్వామి
సింహగిరులపైనవెలసినాస్వామి
చెయ్యెత్తి మొక్కితే దీవించుసామి-ఆలకించి మామ్మాదుకొనుస్వామి
వరాహరూపానవెలసినాస్వామి-నరసింహరూపాన్ని
కలిపినాస్వామి
నర మృగ
అవతార నృసింహస్వామి
చెయ్యెత్తి మొక్కితే దీవించుసామి
చల్లని
స్వామి-మాచందనస్వామి- చెయ్యెత్తి మొక్కితే
దీవించుసామి.
వరాహావతారంగా హిరణ్యాక్షు ద్రుంచి,
.భూమినిరక్షించి బ్రోచినావపుడు
హిరణ్యకశిపుడు నిలదీసిఅడుగ-బాలప్రహ్లాదుని,
ధర్మాన్నిగావ,
స్తంభం నుండొచ్చి రక్కసునిజంపి, ఉగ్ర
రూపముతోడ ఊగునినుజూచి
బ్రహ్మాదిదేవతలు ,రుద్రుడు,
మునులు, శాంతిపజూసినా చల్లబడకుండా,
భక్తుడగు ప్రహ్లాదు ప్రార్దనకుకరిగి- సింహగిరిపై వెలసి సేవలందేవు
కృతయుగ కాలపు గాధలివియ౦ట,
దేవతలు గుడికట్టి కొలచినారంట.
బ్రహ్మోత్సవాలు చేసినారంట,
సకలవైభవాలు చాటినారంట.
ఆనాటి ఆ కథలు ఆనందమంటా.అఖిలలోకాలు ముదమందునంట.
వైశాఖ శుద్ధ తదియనా డ౦ట,వరాహనరసింహునవతారమంట
ప్రహ్లాదుని బ్రోచివెలసినాస్వామి- తరతరాలట్లు
సేవలందినాడంట
చల్లని స్వామిమనచందనస్వామి ,
సింహగిరులపైనవెలసినాడంట
యుగములంతరి౦చి జగములు పోవ, ఆరాధనలు లేక అదృశ్యమయ్యి.
కృతయుగానా తీరు కోలువైనస్వామి-
కాలచక్రముతిరుగకన్నుమరుగయ్యె.
ఆరాధనలులేక
ఆకొండపైన, పుట్టలోపలయుండెతూర్పుకనుమలలో
ఆరుగురు
గొప్ప చక్రవర్తులలో- అదృష్టవంతుడగు
ఆపురూరవుడు
దివ్యవిమానములో తిరుగాడు చుండి, బంగాళాఖాతపు
తీరాన యున్న
సింహగిరులలోతిరుగాడుచుండ,అదేమిమహిమాయో
అద్భుతమోగాని
విమానమటనుండి కదలనేలేదు ,విస్తుపోయిన రాజు
పురూరవుండు
విషయమేమిటని ఊర్వశిని అడుగ ,దివ్యదృష్టితో
చూచినప్సరస
దేవదేవుడు
ఆ నృసింహస్వామి, వరహమూర్తిగా
వెలసినాడయ్య
స్వామిని వేడుకో శుభమునీకనిన ,అట్లేజేసెను ఆ
పురూరవుడు.
ఆనాటిస్వప్నాన ఆరాజు కలలో, వరాహనరసింహ స్వామికన్పించి
పుట్టలో ఉన్నాను బయిటకు తీయు, పూజలుజరిపించి
ప్రఖ్యాతిపొందు
అనిచెప్ప
ఆరాజు సంతోషమంది ,.మహద్ భాగ్యమని
మదిలోన తలచి
సహస్ర కలశముల జలములతోను, పంచామృతములతోపుట్టను
తడిపె.
జ్ఞానచక్షువుకు గోచరించేను. వరాహస్వామతని కానతిచ్చేను.
ఆజ్ఞనౌద లదాల్చిఆపురూరవుడు - మట్టితొలగించినంతమంచి
గంధమును.
స్వామిపైపెట్టి శాంతిజరిపాడు- తొమ్మిదిమణుగుల
గంధముపెట్టాడు.
ఆనాటినుండి ఆ పద్ధతిలో ముమ్మారు స్వామికి మూడుమణుగులలో
హరి చందనమునుపెట్టి అద్దుతుంటారు.వైశాఖపున్నమికి
ఒకటవ సారి
జ్యేష్టపున్నమికి రెండవసారి .ఆషాడపున్నమికి
మూడవసారి
శ్రీచందనమును శిరసునపెట్టి .నిత్యమూ చందనపు
పూతలుపూసి
స్వామినిగొల్చుట సంప్రదాయముగా- చేసాడుఆనాడుపురూరవుండు.
ఘనముగా
గోపురములన్ని కట్టించి, స్వామికి ఎన్నెన్నో సేవలుజేసే
వైశాఖ శుద్ధతదియ శుభదినము -చందనోత్సవమని
శాసనముజేసి
పూజలు జరిపెనాపురూరవుడు- అనుచుస్థలపురాణము
చెప్తోందిమనకు.
ఆనాటినుండి చందనోత్సవము- ఆ తిధిని జరుపుట ఆచారమయ్యే
సింహవల్లిగా లక్ష్మి సేవించు చుండ- ఆదినారాయణుడుఅవనిపాలించు
అంతియేగాక ఆచరిత్రజూస్తే, ఈనాటి ఆలయము క్రీస్తు పూర్వమున తొమ్మిదవశతాబ్ది
నాటికుందనుచు ,
పదమూడవశతాబ్దిప్రారంభమందు
పునరుద్ధరి౦ప బడినదని చరిత్రగలదు,
పాంచరాత్రాగమనపద్ధతిలోన
పూజలుచేస్తారు పురుషోత్తమునకు ,.ఉత్సవామూర్తిగా
గోవిందరాజు
శయనమూర్తిగామదన గోపాలుడున్ను.స్నపనమూర్తివేణుగోపాలస్వామి బలిమూర్తిగా
యోగానారశి౦హుడును, .చక్రపెరుమాళ్గాసుదర్శనుడును
కొలువుతీరగా మన నృశి౦హస్వామి-కన్నులపండుగ జేయు
చున్నాడు .
స్వామిమహిమలు పొగడ శేషునికైనా, శక్యంబుగాదు
మానవులదెంత?
బ్రహ్మాదిదేవతలు మునులు దిగివచ్చి-
కొలిచినస్వామికి మనకోలుపులెంత ?
అయిననూ ఆస్వామి అప్పన్న అనుచూ- అమాయకముగా
అనిననూగాని
తలచినాకోలిచినా తృప్తిని చెంది -కోరిన వరములు
కురిపించుతాడు’
పుష్కరిణిలోమునిగి- గన్నేరుపూలు వేసినా వెంటనే
కరుణించు తాడు.
గంగ ధారలలోన స్నానాలుజేసి, ఘనముగా స్వామికి
పూజలుజేసి
తులసిమాలలు వేయ తృప్తినిపొందు, అర్చనలు జేయగా
ఆశీర్వదించు’
చందనమునుపూసి సంపెంగపూల పూజలు చేసినా పొంగిపోతాడు
హరిహరీ నారాయణాది .నారాయణఅనిభజనలుజేయగాసంతసిస్తాడు
శక్తికొలదీపూజ భక్తితోమ్రొక్కు- మ్రొక్కగాకోర్కెలు తీర్చుతుంటాడు
కప్పస్తంభము నెల్లి కౌగలించుకొని- కోరితే కోరికలు
తీర్చుతుంటాడు
కోడెదూడ నొదిలి
కొత్తపంటలను- అర్పించి సేవింప ఆదుకుంటాడు
సంపెంగపూలతో పూజింప స్వామీ మనపై దయను వెదజల్లుతాడు
గిరిప్రదక్షనముచేయ గురుతుపెట్టుకొని అప్పన్న
అనగానే ఆదరిస్తాడు ..
రూపమేకోపము మనసెంతో వెన్న- వరాహనరశింహస్వామియేమిన్న
నిజరూపదర్శనము నిత్యమూగాదు,ఏడాది కొకసారే
చందనోత్సమున
చల్లనిస్వామి మా చందన స్వామి- తలచినా కొలచినా
దయచూపుతాడు .
ఈ చరితమువిన్న చదివినా స్వామి- సకలశుభములుగూర్చి
రక్షించుతాడు .
దండాలు దండాలు దండాలు స్వామీ దయగల తండ్రిమానరసింహ
స్వామి
పిల్ల పాపలనంత చల్లగా భ్రోచి కాపాడుచుండుమా
కడదాకా మమ్ము.
------------శుభం--------------------
ఆర్యా!
నమస్కారములు.
చల్లని స్వామి-మాచందనస్వామి సింహగిరులపైనవెలసినాస్వామి అనే ఈ
గేయకవిత నా ఊహాజనితం .ఎవరినీ
అనుకరించి
అనుసరించి వ్రాసినది
కాదు.నాస్వంతమని విన్నవించు కొంటున్నాను.
ఇట్లు
కవయిత్రి /రచయిత్రి, శ్రీమతి .దామరాజు .విశాలాక్షి
ఇంటినెం;
4/199, విద్యానగర్.గోపాలపట్నం,
విశాఖపట్నం-27.damaraju.visalakshi@gmail.com.